Fog Effect: ఢిల్లీని కమ్మేసిన మంచు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దేశంలో చలి రోజురోజుకూ తీవ్రమవుతోంది. రెండు, మూడు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగిపోయింది. ఇక ఢిల్లీ గురించి చెప్పాలంటే.. అక్కడి ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా దట్టమైన పొగమంచు కారణంగా 16 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదనంగా, ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రత తగ్గుదల, పొగమంచు కారణంగా 11 అంతర్జాతీయ, ఐదు దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. విమానాశ్రయానికి సమీపంలోని పాలెం వద్ద కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
Also read: TSRTC: ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ.. కొత్త బస్సులపై సంస్థ దృష్టి
దేశ రాజధానిపై చలి పంజా విసరడంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎముకలు కొరికే చలికి తట్టుకోలేక చాలామంది ఎయిమ్స్లోని నైట్ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్నారు. శనివారం తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, చలి విపరీతంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణ స్థితికి పడిపోయింది.