తెలుగు
te తెలుగు en English
మరిన్ని

PV Sindhu: ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధుకు చోటు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. 2023లో అత్యధికంగా ఆర్జించిన 20మంది మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆమె రూ.59 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. అయితే ఫోర్బ్స్ 2023 జాబితాలో భారతదేశం నుంచి టాప్- 20లో నిలిచిన ఏకైక మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు రికార్డులకెక్కింది. కాగా, ఈ జాబితాలో జాబితాలో టెన్నిస్ తార, పోలండ్ కు చెందిన ఇగా స్వియాటెక్ 23.9 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 199కోట్లు) ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది.

ALSO READ: క్రికెట్‌లో కొత్త స్టంప్స్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

గత కొన్నేళ్లుగా ఫోర్బ్స్ జాబితాలో..

గత కొన్నేళ్లుగా ఫోర్బ్స్ జాబితాలో సింధు ఉంటోంది. గతేడాది 12వ స్థానాన్ని సాధించగా.. 2018లో రూ.70 కోట్లతో సింధు ఫోర్బ్స్‌ జాబితాలో అత్యున్నతంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ ఏడాది సింధుకు మైదానంలో ఏమాత్రం కలిసిరాలేదు. ఈ ఏడాది మ్యాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలవడమే సింధు అత్యుత్తమ ప్రదర్శన. డెన్మార్క్ ఓపెన్, ఆర్కిటిక్ ఓపెన్‌లలో ఆమె సెమీస్‌తోనే సరిపెట్టుకుంది. ఒక్క ట్రోఫీ కూడా నెగ్గని సింధు.. సంపాదనలో మాత్రం వెనుకంజ వేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button