తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Ladies: మహిళలకు ఫ్రీ జర్నీ.. సీటు కోసం సిగపట్లు

తెలంగాణలో మహాలక్ష్మి పథకం- మహిళలకు ఫ్రీ జర్నీతో పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో బస్సులన్నీ ఫుల్ గా నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు టిక్కెట్టు కొనుగోలు చేస్తున్న పురుషులు ఎలాగో సర్దుకుంటూ ప్రయాణాలు చేస్తుంటే.. ఫ్రీ గా ప్రయాణించే మహిళలు మాత్రం కొట్లాటలకు దిగుతున్నారు.

Also read: TSBIE: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

తాజాగా వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న పల్లెవెలుగు బస్సులో మహిళలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. అలాగే బస్సు మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే దస్తీ వేసిన సీట్లో వేరే మహిళ కూర్చోవడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో మాటామాటా పెరిగి జట్లు పట్టుకుని కొట్టుకునే వరుకు వివాదం వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button