తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Nalgonda: ‘దొంగ ప్రేమ జంట’.. ప్రియుడు బండి నడిపితే ప్రేయసి చైన్ లాగేస్తది

ఇన్నాళ్లు దొంగలు చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవారు. ఇప్పుడు కొత్తగా ప్రేమికులు గొలుసులు తస్కరిస్తు్న్నారు. తెలంగాణలో ఓ ప్రేమ జంట రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించిన మహిళల మెడలలోంచి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గొలుసు తస్కరించి స్కూటీపై అత్యంత వేగంగా పరారవుతున్న వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ సితారే: కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ హెచ్చరిక

మర్రిగూడ మండల యారగండ్లపల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత శుక్రవారం గ్రామంలో పనిపై బయటకు వచ్చారు. ఈ సమయంలో వెనకాల నుంచి స్కూటీపై వచ్చిన ఓ యువతి యువకుడు ఆమె మెడలోని 4 తులాల పుస్తెల తాడును తెంపుకుని వెళ్లారు. బాధితురాలు దొంగ దొంగ అని అరవడంతో గ్రామస్తులు బైక్ పై వారిని అనుసరించారు. చైన్ స్నాచింగ్‌ చేస్తున్న ఆ జంటను పట్టుకునేందుకు గ్రామస్తులు బైక్ లపై వెంబడించారు. కానీ ఆ జంట స్కూటీపై వేగంగా పరారయ్యారు. వెంబడిస్తున్న సమయంలోనే గ్రామస్తులు స్కూటీపై వెళ్తున్న ఆ జంట వీడియోను చిత్రీకరించారు. యువకుడు స్కూటీ నడుపుతుండగా.. యువతి మహిళ మెడల్లో నుంచి చైన్‌లను తెంపుకుని పారిపోతున్నారని ఇటీవల మర్రిగూడ మండలంలో ప్రచారం జరుగుతోంది. ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Also Read బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. సినీనటి జయసుధ పార్టీని వీడనున్నారా?

బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఈ జంటను గుర్తించినట్లు సమాచారం. ఈ యువ జంట కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ డీఎస్పీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button