తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Marriguda: చైన్ స్నాచింగ్ లో కొత్త ట్విస్ట్.. వారిద్దరూ ప్రేమికులు కాదు.. భార్యాభర్తలే

చైన్ స్నాచింగ్ లో యువతి పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మహిళ మెడలోంచి గొలుసును తస్కరించి స్కూటీపై పరారైన యువతీయువకులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఇప్పటిదాకా వారిద్దరూ ప్రేమికులు అనుకుంటుండగా.. వారు ప్రేమ జంట కాదని.. ఇద్దరు భార్యాభర్తలు అని తేలింది. వారిద్దరినీ అరెస్ట్ చేసి నల్లగొండ జిల్లా పోలీసులు రిమాండ్ కు తరలించారు.

చదవండి: ‘దొంగ ప్రేమ జంట’.. ప్రియుడు బండి నడిపితే ప్రేయసి చైన్ లాగేస్తది

నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో ఈనెల 12న స్కూటీపై ఓ యువతీయువకుడు వెళ్తూ సునీత అనే మహిళ మెడలోంచి గొలుసును తస్కరించారు. వారిని పట్టుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా ఆ జంట స్కూటీపై పరారైంది. నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలించారు. హైదరాబాద్ లోని సంతోశ్ నగర్ వద్ద స్కూటీపై పారిపోతున్న జంట పోలీసులకు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చదవండి: భోగి వేడుకల్లో మరోసారి మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్

ఆ రోజు బాధితురాలు సునీతను లిఫ్ట్ పేరుతో స్కూటీపై ఎక్కించుకున్నారు. కొద్ది దూరం దాకా వెళ్లిన ఆ జంట వెంటనే సునీతను బెదిరించి మెడలో ఉన్న ఏడు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు. పట్టుబడిన నిందితుల పేర్లు వెంకటేష్, అతడి భార్ గా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు అలవాటుపడి ఈ దంపతులు చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో చైన్ స్నాచింగ్ నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని పోలీస్ ఉన్నత అధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button