Terrorist: అల్ ఖైదా ఉగ్రవాది ఖలీద్ మృతి
అల్-ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతి చెందాడు. ఈ మేరకు అల్-ఖైదా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఖలీద్ మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత ఇతని నేతృత్వంలోనే అల్ ఖైదా యెమెన్ గ్రూప్ అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా అవతరించినట్లు తెలుస్తోంది. పలుసార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చిన కారణంతో ఆ దేశ ప్రభుత్వం ఖలీద్పై దాదాపు రూ.50 కోట్ల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
ALSO READ: ఈసారి ‘ఆస్కార్’ ఎవరిని వరించిందంటే..!
సౌదీ అరేబియాలో పుట్టిపెరిగిన ఖలీద్ అల్-బటర్ఫీ 1999లో అఫ్గానిస్థాన్కు మకాం మార్చాడు. అక్కడ తాలిబన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. 2010లో అల్ఖైదాలో చేరాడు. యెమెన్లోని అబ్యాన్ ప్రావిన్స్ ఆక్రమణలో కీలక పాత్ర పోషించారు. 2020లోనే అతడు అగ్రరాజ్య సైనికుల చేతికి చిక్కినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజమెంతో ఇప్పటికీ స్పష్టత రాలేదు.
What’s up everyone, it’s my first pay a visit at this web site, and paragraph is actually fruitful in support of me, keep
up posting these articles or reviews.