![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/11/bolly-780x470.jpg)
Bollywood: బాలీవుడ్ స్టార్లకు కలిసొచ్చిన డీల్.. వారి ఫ్లాట్ల అమ్మకం
బాలీవుడ్ స్టార్లు రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ పెద్ద డీల్స్ కుదర్చుకున్నారు. దీంతో ముంబై లోని వారి ఆస్తులను అమ్ముకున్నారు.
ఇక బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ముంబైలోని రెండు అపార్ట్మెంట్లను విక్రయించాడు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఫ్లాట్లు మొత్తం 15.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఆన్లైన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ IndexTap.com ప్రకారం, రణవీర్ సింగ్ ఈ రెండు ఫ్లాట్లను డిసెంబర్ 2014లో ఒక్కో ఫ్లాట్కు రూ.4.64 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు.
కొనుగోలు సమయంలో ఒక్కో ఫ్లాట్కు రూ.45.75 లక్షల ఫ్లాట్ స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్లాట్ల విస్తీర్ణం మొత్తం 1,324 చదరపు అడుగులు ఉంది. దీనితో పాటు ప్రతి ఫ్లాట్లో మొత్తం 6 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ను అదే అపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు.
రణ్వీర్ సింగ్తో పాటు ఇటీవల అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్ కూడా తమ ఆస్తులు అమ్మేందుకు ఒప్పందాలు చేసుకున్నారని టాక్. సోనమ్ కపూర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని 5,000 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 32 కోట్లకు విక్రయించాల్సి ఉంది. కాగా అక్షయ్ కుమార్ 1200 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ను రూ.6 కోట్లకు విక్రయించారు. ఈ ఒప్పందం 2022 సంవత్సరంలో జరిగింది.