India Today Survey: మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే.. కేంద్రంలో అధికారం ఎవరిదంటే?
దేశంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయనప్పటికీ.. పొలిటికల్ పార్టీలు మాత్రం ఎన్నికల పనులు జోరుగా సాగిస్తున్నాయి. ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ సారి ఎలాగైనా బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే నేతృత్వంలో ‘మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే’ ఫలితాలను వెల్లడించింది.
Also read: Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఈనెల 10న బడ్జెట్
ఫలితాల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ప్రజలు మూడ్ దీనికి అనుగుణంగానే ఉందని సర్వేలో తేలింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి, దాని మిత్ర పక్షాలకు తిరుగు లేకుండా ఉందని సర్వే రిపోర్ట్ చెప్తోంది.
అందులో బీహార్ లో 40 స్థానాలు ఉండగా.. ఎన్డీఏకి 32, ఇండియా కూటమికి- 8, పశ్చిమ బెంగాల్ లో 42 స్థానాలకు గాను ఎన్డీఏ- 19, తృణముల్ కాంగ్రెస్ కి 22, యూపీలో 80 స్థానాలు ఉండగా.. ఎన్డీఏ- 70, ఇండియాకి-10, హిమాచల్ ప్రదేశ్ లో 4 స్థానాలు ఉండగా.. బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లో 5 స్థానాల్లో బీజేపీ-2, ఇండియాకి-3 , హర్యానాలో 10 సీట్లు ఉండగా.. బీజేపీ-8, కాంగ్రెస్-2, పంజాబ్ లో 13 సీట్లకు బీజేపీ-2, ఆప్-5, కాంగ్రెస్-5, ఎన్ఏడీ-1 ఉత్తరాఖండ్ లో 5 సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుంది. జార్ఖండ్ లో 14 సీట్లకు గాను బీజేపీ-12, ఇండియాకి-2, అస్సాంలో 14 సీట్లకు గాను బీజేపీ-12, ఇండియా-2 సీట్లను గెలుచుకోనుందని అంచనా వేసింది.