తెలుగు
te తెలుగు en English
జాతీయం

RLD: ఇండియా కూటమికి మరో షాక్.. బయటకు వచ్చేసిన మరో పార్టీ

ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ పలు పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే, ఇండియా కూటమి రూపశిల్పిగా పేరున్న సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో పొత్తును కాదని.. మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు. ఇక టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తులేదని, చివరకు ఆ పార్టీ 40 స్థానాలైనా గెలుస్తుందా.? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇక మమతా దారిలోనే ఆప్ కూడా నడుస్తోంది.

Also read: Bharatratna: మాజీ ప్రధాని పీవీకి భారతరత్న.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డ్

ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తాకింది. జయంత్ చౌదరి ఆర్ఎల్‌డీ పార్టీ ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీతో పొత్తుపెట్టుకుంది. సీట్ల ఒప్పందంలో భాగంగా.. ఆర్ఎల్‌డీ రెండు లోక్‌సభ స్థానాలైన బాగ్‌పత్, బిజ్నోర్‌లో పోటీ చేస్తుంది. రాజ్యసభ సీటుకు కూడా హామీ లభించింది. అనంతరం జయంత్ చౌదరి మాట్లాడుతూ.. దేశ ప్రజల నాడిని ప్రధాని నరేంద్రమోడీ అర్థం చేసుకున్నారని.. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయలేనిది మోడీ దార్శనికత సాధించిందని కొనియాడారు.

ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో జయంత్ చౌదరి ఆర్ఎల్‌డీ ప్రభావం ఉంది. జాట్ కమ్యూనిటీలో ఈ పార్టీకి మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆ ప్రాంతంలో పొత్తతో బీజేపీ బలపడాలని భావిస్తోంది. మరోవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకాల విషయంలో లుకలుకలు సమసిపోవడం లేదు. జనవరి నెలలో ఆర్ఎల్‌డీకి అఖిలేష్ యాదవ్ 7 సీట్లు కేటాయిస్తామని చెప్పినప్పటికీ.. ఏయే సీట్లనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆర్ఎల్డీ- బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button