తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth: కలెక్టర్లతో రేవంత్ రెడ్డి భేటీ… కీలక విషయాలపై చర్చ

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి కలెక్టర్లతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ పధాన కార్యదర్శి శాంతికుమారి, తదితర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పాల్గొన్నారు.

Also Read: కాంగ్రెస్ కు కౌంటర్ గా… నేడు బీఆర్ఎస్ స్వేద పత్రం రిలీజ్!

ప్రజా పాలనను అందించడంపైనే ప్రధానంగా సీఎం కలెక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలిసింది. జనవరి నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఆరు గ్యారెంటీలను వీలైనంత త్వరగా అమలు చేసే విషయంలో సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఆరు గ్యారెంటీల్లో ముఖ్యంగా 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధిదారులు, కొత్త రేషన్‌ కార్డులకు అర్హులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ నెల 28వ తేదీ నుంచి గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహించనుంది. 7 నుంచి 9 రోజుల పాటు గ్రామ సభలు జరగనున్నాయి. వీటన్నింటిపై సీఎం కలెక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button