తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth Reddy: తెలంగాణలో ప్రజాపాలన.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. పాలనపై వారికి దిశానిర్దేశం చేశారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలన యంత్రాంగాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Also read: Contonment Mla: లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఎమ్మెల్యే.. డోర్లు బద్దలు కొట్టిన సిబ్బంది

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు గ్రామసభలు చేపడతారు. రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో రోజుకు రెండు చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాపాలన కార్యక్రమానికి సర్పంచ్‌, స్థానిక కార్పొరేటర్‌, కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్‌ ఇచ్చి.. వాటిని కంప్యూటరైజ్‌ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button