తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KA Paul: పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్ సెటైర్లు.. జనసేన పరువు తీసేశాడు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. ఇవాళ విశాఖలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అవినీతి పార్టీ అని, పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత ‘పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశారు’ అనే పరిస్థితి వస్తుందని పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.

ALSO READ:  సీఎం రేవంత్ ను కలిసిన కేఏ పాల్… ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం

ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇవ్వండి

చంద్రబాబు గత 14 ఏళ్లలో చాలా అవినీతికి పాల్పడ్డారని కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, అందుకే ప్రజాశాంతి పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని కేఏపాల్ పేర్కొన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పోటీలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ తరపున అభ్యర్థులను పరిశీలనతోపాటు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నట్లు సమాచారం.

5 Comments

  1. I am extremely impressed with your writing skills as smartly
    as with the layout to your blog. Is this a paid subject or
    did you customize it your self? Anyway stay up the excellent quality
    writing, it’s rare to look a nice blog like this one today..

    Here is my web-site … vpn 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button