తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Kishan Reddy: దేశ చరిత్రలోనే మరపురాని రోజు.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

కొత్త‌గా నిర్మించిన అయోధ్య‌ ఆల‌యంలో బాలరాముడి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. శ్రీ రామ జ‌న్మ‌భూమి రామ‌మందిరంలో ఇవాళ శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని జి.నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి కాలేజీ యాజమాన్యంతోపాటు సిబ్బంది, విద్యార్థినులు అయోధ్య రామాలయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఓంకార నాదంతో పాటు హనుమాన్ చాలీసాను పాడారు. దీంతో కళాశాల ఆవరణం రామ నామంతో మార్మోగింది.

ALSO READ:  అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు.. ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ

జాతి గర్వించదగ్గ రీతిలో..

దేశ చరిత్రలో మరపురాని రోజు అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాతి గర్వించదగ్గ రీతిలో రామమందిరం నిర్మించారని చెప్పారు. అనంతరం కళాశాల వైస్ చైర్ పర్సన్ విద్యా రెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొన్న ఏకైక కార్యక్రమం ఇదే అని, అయోధ్య రామాలయ నిర్మాణం జి. పుల్లారెడ్డి కల అని గుర్తుచేసుకున్నారు. కాగా, అయోధ్య రామ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రపంచంలోని 150 దేశాల ప్రజలు వీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button