KTR: కాంగ్రెస్ కు కౌంటర్ గా… నేడు బీఆర్ఎస్ స్వేద పత్రం రిలీజ్!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత తొమ్మిదెన్నర పాలన, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్ను రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేదపత్రంను విడుదల చేయనుంది.
Also Read: ఏపీ అప్పులపై కేంద్రం క్లారిటీ.. టీడీపీ కంటే వైసీపీ అప్పులే తక్కువ
ప్రభుత్వ శ్వేత పత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ స్వేద పత్రం విడుదల చేయనుంది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రం విడుదల చేయనున్నారు. బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని ఆయన తెలిపారు.
Also Read: మాట మీద నిలబడని ప్రశాంత్ కిషోర్.. నైతిక విలువలు లేవా?
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోమన్నారు. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించడానికే స్వేద పత్రం విడుదల.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.