తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TBJP: తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతుంది: కిషన్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలోనే దేశానికి భద్రత పెరిగిందన్నారు. అందుకే పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా మూడోసారి కూడా మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలన నీతివంతంగా సాగిందని చెప్పారు. తీవ్రవాదం, ఉగ్రవాదం తగ్గి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు.

Also Read: కొలిక్కి వస్తున్న పొత్తులు.. కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీల ఆఫర్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 370 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా తెలంగాణలోని 17కు 17 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఉండబోదని కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని చెప్పారు.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button