![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/kishan-redd-780x470.jpeg)
Telangana: టీబీజేపీ కీలక సమావేశం… ఎన్నికల వ్యూహం ఏంటి?
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ సిట్టింగ్ స్థానాలతో పాటు మరికొన్ని సీట్లు సాధించి కేంద్రానికి బహుమతి అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపధ్యంలోనే లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
Also Read: దేశంలో ప్రజాదరణ ఎక్కువ ఉన్న సీఎం ఆయనే… మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
ఈ బేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు ఇన్ చార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇందులోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితా కూడా రూపొందించనున్నారు. ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి, అభ్యర్దులను ఖరారు చేస్తారని సమాచారం. అయితే ఇప్పటికే బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన తమ సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఖాయం చేసినట్లు తెలుస్తొంది.