Bridge: కృష్ణానది పై బ్రిడ్జి… ప్రజలకు తగ్గనున్న ప్రయాణ దూరం
డైనమిక్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా ఆయన చేయుత అందిస్తున్నారు. ప్రజల గురించి నిత్యం ఆలోచించే జగన్… మరో అభివృద్ది పనిని చకచక పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీని వల్ల ప్రజలు తమ మార్గన్ని సులువుగా చేరవచ్చని తెలుస్తుంది. కృష్ణానదిపై నిర్మించే బ్రిడ్జిని త్వరగా అందుబాటులోకి తెచ్చే పనిలో ఏపీ సర్కార్ ఉంది.
Also Read: ఏపీకి మరో తుపాన్ ముప్పు… రైతులకు ఐఎండీ అలర్ట్
రాయపూడి-లింగాయపాలెం నుంచి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వరకు అమరావతిని కలుపుతూ కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల వంతెనను 1,423 కోట్లతో బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇటీవలే వంతెనకు సంబంధించిన సర్వే పూర్తి చేసి టెండర్లు పిలిచి పనులను కూడా ప్రారంభించారు. ఈ 6 లైన్ల వంతెన విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో భాగమని తెలుస్తుంది. బ్రిడ్జి పనులను తర్వగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంకోసం ఏపీ ప్రభుత్వం పనులను ముమ్మరం చేసింది. వీలైనంత తర్వగా పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రజలకు ప్రయాణ భారం తగ్గనుండటంతో వాళ్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.