తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Fire Accident: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

హనుమకొండ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ యార్డులో ఉన్న పాత ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

ALSO READ: మార్చి 13న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్?

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ బోగీ నుంచి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలు కాస్త పెరిగి భారీ అగ్ని ప్రమాదానికి దారి తీసింది. మంటలు పెరుగుతూ పక్కనే ఉన్న మరో ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి. ప్యాసింజర్ రైలులోని పలు భోగీలకు మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదం జరిగేటప్పుడు రైలులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button