ప్రత్యేక కథనం
Accident: దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ (మ) నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు హైదరాబాద్.. సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురంకి చెందిన మంత్రి రవీందర్ కుటుంబంగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నవదంపతులు బాలకిరణ్, కావ్య మృతి చెందారు.
Also read: Fire Accident: కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మీ, రవికుమార్, తమ్ముడు ఉదయ్ కిరణ్ మృతి చెందారు. ఫిబ్రవరి 29న బాలకిరణ్ కు తెనాలిలో పెళ్లి వేడుకలు జరగగా ఈ నెల 3న శామీర్ పేటలో రిసెప్షన్ అయినట్లు తెలిసింది. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
One Comment