![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/traffic-780x470.webp)
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… ట్రాఫిక్ చలాన్ల గడువు పెంపు
ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ గడువు నేటితో ముగియనుంది. గత డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీ కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1.14 కోట్ల చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: గోడను ఢీకొట్టిన చార్మినార్ ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులకు గాయాలు
మొత్తం ఇప్పటి వరకు 100.5 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రాగా అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్ అవ్వగా వీటి ద్వారా 57.53 కోట్ల రాబడి వచ్చింది. ఇంకా 2.45 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ఎక్కువ మంది వాహనదారులు ఈ-చలాన్ సైట్ ఓపెన్ చేయడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగింది. సర్వర్ సమస్య తలెత్తడంతో చలాన్లు కట్టెందుకు ఎక్కవ సమయం పడుతోంది. దీంతో ఈ గడువును పొడిగించాలని వాహనదారులు కోరారు.
Also Read: టీఎస్ పీఎస్సీ పాలకమండలి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం..
ద్విచక్రవాహనాలకు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన ఈ చలాన్లకు మంచి స్పందనే లభించింది. దీంతో మరోసారి గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.