తెలుగు
te తెలుగు en English
మరిన్ని

New Movie: కంగనా, మాధవన్ జంటగా కొత్త మూవీ.. షూటింగ్ ప్రారంభం

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తమిళ నటుడు మాధవన్ జోడిగా కొత్త మూవీ తెరకెక్కబోతోంది. ఇందుకు సంబంధించి మూహుర్తం పూజ కూడా జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా వీరిద్దరూ కలిసి 2015 లో చివరిసారిగా నటించగా.. మళ్లీ 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతున్న చిత్రం కలిసి నటించబోతున్నారు.

Read also: Nayanthara: ప్రభాస్ పై నయనతార క్రేజీ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో

కాగా ఈ మూవీని ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తుండగా, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ సంగీతం అందించనున్నారు. అలాగే సినిమాకు ప్రొడ్యూసర్ రవింద్రన్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక 2015లో వీరిద్దరి జోడీగా వచ్చిన ‘తను వెడ్స్ మను’ చిత్రం విడుదలై సూపర్ హిట్టుగా నిలిచింది. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ కూడా వచ్చింది. అది కూడా హిట్టు కొట్టింది. ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కాబోతున్న సినిమా కూడా హిట్టు కావాలని పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button