తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KA Paul: సీఎం రేవంత్ ను కలిసిన కేఏ పాల్… ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని , ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించినట్లు కేఏ పాల్ తెలిపారు. గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను సైతం మంజూరు చేయాల్సిందిగా కేఏ పాల్ కోరారు.

Also Read: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం… లోకేష్ కు గిఫ్ట్ పంపిన షర్మిల

అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అనంతరం ఈ విషయాన్ని కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరవ్వనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button