![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/107663914-780x470.webp)
KCR: నా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడుతా: కేసీఆర్
తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాలేచి కొట్లాడుతానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఛలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలపై మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మొన్న అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రమే నయమని అప్పుడే మంచిగుండేనని అన్నారని తెలిపారు. అలాంటప్పుడు శ్రీకాంత చారి ఎందుకు చనిపోయిండని… ఉద్యమకారులు ఎందుకు చనిపోయారు ? అంతపెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది ? లక్షలు, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు ? ఇంత సోయితప్పి మంత్రులు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.
Also Read: చంద్రబాబు, పవన్ సమావేశం వాయిదా… రేపు అభ్యర్థుల ప్రకటన లేనట్లేనా?
కృష్ణా నీళ్లమీద హక్కు అనేది.. మనందరి బతుకులకు చావో రేవో తేల్చే సమస్య అని తెలిపారు. ఈ మాట తాను తెలంగాణలో పక్షిలాగా తిరుగుతూ చెప్పవట్టి 24 ఏళ్లు అయిందని తెలిపారు. కృష్ణా కావోచ్చు.. అటు గోదావరి కావోచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు. లక్షా యాబై వేల మంది మునుగోడు, దేవరకొండ ఇతర ప్రాంతాల్లో బిడ్డల నడుములు ఫ్లోరైడ్తో వంగిపోయాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారలంతా కలిసి ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిన బిడ్డలను తీసుకెళ్లి ప్రధానమంత్రి టెబుల్పై పడుకోబెట్టి.. అయ్యా తమ బతుకు ఇది అంటే పట్టించుకున్నవారు లేరని తెలిపారు. నల్గొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జీరో ఫ్లోరైడ్గా చేశామని కొనియాడారు.