Kodangal: సొంత నియోజకవర్గంపై రేవంత్ దృష్టి… అభివృద్ది కోసం కాడా ఏర్పాటు
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సీఎం అయ్యారు. దాంతో ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగు అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి వెంటనే స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Also Read: అదంతా తప్పు.. నేను రాజీనామా చేయడం లేదు: గవర్నర్ తమిళిసై
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఉనికిలోకి వచ్చింది. దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి చైర్మన్గా వ్యవహరించనున్నారు. మౌళిక వసతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు వంటి ప్రోగ్రామ్లను ఇక్కడ ప్రత్యేకంగా చేపట్టనున్నారు.
Also Read: ప్రజాపాలనపై సీఎం సమీక్ష.. రైతుబంధు, పింఛన్లపై ప్రకటన
కొడంగల్, వికారాబాద్, నారాయణ్ పేట్ ప్రాంతాల అభివృద్ధి కోసం KADA ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని బలంగానే ప్రస్తావించడంతో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రణాళికలు వేగంగా కదలుతున్నాయి.