![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/Kishanreddy-1a.jpg)
Madaram: ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తాం: కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా వన దేవతలను దర్శించుకొని ప్రధాని మోడీ తరపున మొక్కులు చెల్లించారు. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు వన దేవతల దర్శనం కోసం మేడారం రాబోతున్నారని ప్రకటించారు. మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. జాతీయ పండుగ అనేది ఎక్కడా లేదని.. ఈ మహా జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Also Read: కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి… జాహ్నవి ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ ఏడాది నుంచే ప్రవేశాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. వర్సిటీ భవనాలకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చేత శంకుస్థాపన చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ యూత్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తామని హామీ ఇచ్చారు.