తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్… మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బదిలీలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో నిన్న 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. కాగా ఈరోజు మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పురుపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సోమవారం 105 మంది పంచాయతీ రాజ్ సిబ్బందిని సైతం ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది.

Also Read: పుల్వామా అమరులకు ప్రధాని నివాళులు.. వారి త్యాగం మరిచిపోమని వెల్లడి

మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button