తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Telangana: పెండింగ్ చలాన్లపై డిస్కాంట్… ఎంత ఆదాయం వచ్చిందంటే?

ట్రాఫిక్ పెండింగ్‌‌ చలాన్లకు వాహనదారుల నుంచి భారీగా స్పందన వస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉండగా గతేడాది డిసెంబర్ 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించింది. బైక్​లు, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు,హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌కు 60 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో వాహనాదారులు వచ్చిన అవకశాన్ని ఉపయోగించుకుంటూ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు.

Also Read: ప్రజాపాలన దరఖాస్తులకు ఈరోజే ఆఖరు.. గడువు పెంపు ఉంటుందా?

దీంతో 2023 డిసెంబర్ 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి 66.77 కోట్ల చెల్లింపులు జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 17 కోట్ల చెల్లింపులు జరగగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13.99 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 7.17 కోట్లు చెల్లింపుల జరిగాయి. ఈ అవకాశం మరో ఐదు రోజుల (జనవరి 10) వరకు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. దీనిని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button