![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-6.24.34-PM.jpeg)
తెలంగాణ
BJP: మహిళల సంక్షేమానికే ప్రభుత్వం పెద్ద పీట: కిషన్ రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని ముషీరాబాద్లో పిల్లలకు, తల్లీ బిడ్డలకు ‘మోదీ కిట్స్’ అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ALSO READ: మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్కు ఊరట
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే అమలు చేస్తున్న ఈ పథకాన్ని భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పోషకాహార లోపంతో తల్లీబిడ్డలు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పారు. అంతేకాదు, పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, ఆయుష్మాన్ భారత్ పథకాలను అమలు చేస్తున్న సంగతి గుర్తుచేశారు.