తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Stalin: మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట

తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. ఇంతవరకు ఆయన దోషిగా తేలలేదని న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ALSO READ: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం మమత.. అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల‌ వేత‌నాల పెంపు!

కాగా.. 2023 సెప్టెంబర్ నెలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన చట్టసభ సభ్యుడిగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న పీకే శేఖర్ బాబు, స్టాలిన్ వ్యాఖ్యలు సమర్థించిన ఎంపీ ఎ.రాజా పేర్లను అందులో చేర్చారు. ఇవాళ ఈ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఇదే కేసు విషయంలో ఇటీవల స్టాలిన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు’ అంటూ ఘాటుగా స్పందించి. ఈ కేసుపై తదుపరి విచారణ మార్చి 15న జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button