Mamata Banerjee: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం మమత.. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాల పెంపు!
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఈ వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కాగా, లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: లోక్ సభ ఎన్నికలు… నోటిఫికేషన్ వచ్చేది అప్పుడే!
నెలకు రూ. 750 పెంపు..
ఆశా వర్కర్లు కష్టపడి పనిచేస్తారని, సంక్లిష్ట సమయాల్లో అండగా నిలిచారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు నెలకు రూ. 750 చొప్పున పెంచినట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో అంగన్వాడీ వర్కర్ల వేతనాలు రూ. 8,250 నుంచి రూ. 9వేల వరకు పెరగ్గా, ఆశా వర్కర్ల వేతనాలు రూ. 6,500కు పెరిగాయి.