తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

TDP: టీడీపీ కూటమిలో మొదలైన ఓటమి భయం!

టీడీపీ కూటమికి ఓటమి భయం పట్టుకుందా? ఏం చేసినా ఈ ఎన్నికల్లో గెలుపు కష్టమేనని ఆ నేతలు అంచనాకు వచ్చారా? అందుకే ప్రచారానికి సైతం వెనకడుగు వేస్తున్నారా? అంటే… ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ ‘వై నాట్ 175, 25’ నినాదంతో ప్రచారంలో దూసుకెళ్తూంటే, టీడీపీ కూటమి మాత్రం తీవ్ర నిరాశలో, నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఓడిపోయే దానికి ప్రచారానికి డబ్బు ఖర్చు చేసి కూడా వృథానే అని లావు కృష్ణదేవరాయలు వంటి టీడీపీ నేతలు తమ క్యాడర్‌కి చెప్పేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీనే గెలిచి అధికారం చేపడుతుందని ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదిక కూడా అందినట్లు సమాచారం.

వైసీపీనే గెలుస్తుందని బెట్టింగులు వేస్తున్న తెలుగు తమ్ముళ్లు!

ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ నేతలకు గడచిన జనవరిలో ఉన్న నమ్మకంలో ప్రస్తుతం ఒక్క శాతం కూడా కనిపించడం లేదు. అందుకే మొన్నటి దాకా టీడీపీ గెలుపుపై ధీమాతో 1: 3 స్థాయిలో బెట్టింగులు కాసిన తెలుగు తమ్ముళ్లు కూడా ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు వైసీపీనే కచ్చితంగా గెలుస్తుందని తెగ బెట్టింగులు వేస్తున్నారట. వాస్తవ పరిస్థితులు కూడా ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైసీపీ జెండాలు, హడావుడి మాత్రమే కనిపిస్తోంది. కూటమిలో ఒక్క చంద్రబాబు, పవన్‌లు తప్పితే ఎవరూ ప్రచారం చేయడంలేదు.

ALSO READ: పులివెందులలో సీఎం జగన్ పర్యటన.. అక్కడే నామినేషన్!

తలలు పట్టుకుంటున్న చంద్రబాబు, పవన్

నిన్నటి దాకా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు లక్షల సంఖ్యలో వస్తే; టీడీపీ, జనసేన ఉమ్మడిగా చేపట్టిన ‘ప్రజాగళం’ సభలు జనాలు లేక వెలవెలబోయాయి. ఈ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. దీంతో ఓటమి భయంతో వారికి ఏం చేయాలో తోచక, వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

4 Comments

  1. జై జగన్ జై జై జగన్ 175కు 175. MP స్థానాలు 25కు 25తప్పక గెలుపు మాదే జై జగన్ జై తలారి రంగయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button