తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పలమనేరు సభలో సీఎం జగన్

రాష్ట్రంలో మరో తొమ్మిది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని, ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్‌.. జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని సీఎం వైఎస్‌ జగన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుందన్నారు. అనంతరం చంద్రబాబును నిలదీశారు. అంతకుముందు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా? మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నారని, కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు.

ALSO READ: డీబీటీ చెల్లింపులపై బాబు అండ్ కో కుట్రలు..ఎన్నికల కోడ్ పేరుతో ఈసీపై ఒత్తిడి ?

హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?

2014 ఎన్నికల్లో చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా? అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా? సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా? అంటూ చంద్రబాబు మోసాలను సీఎం జగన్‌ ఎండగట్టారు.

ALSO READ: రాష్ట్రంలో జరిగేది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌: సీఎం జగన్

లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం

59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని సీఎం జగన్ అన్నారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని, 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామన్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామన్నారు. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని సీఎం జగన్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button