తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

AP Elections: ముహూర్తం ఖరారు.. 25న సీఎం జగన్ నామినేషన్

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రస్తుతం తూర్పుగోదావారి జిల్లాలోకి ప్రవేశించింది. కాగా, ఈ యాత్ర ఈనెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బస్సు యాత్రను ముగించుకొని అదే రోజున పులివెందుల బయల్దేరేందుకు సీఎం జగన్ ముహూర్తం ఖరారైంది. ఇందులో భాగంగా సొంత నియోజకవర్గం పులివెందులలో ఈనెల 25న సీఎం జగన్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అఫిడవిట్లను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు.

ALSO READ: నుదిటిపై గాయం మానకపోయినా.. కొనసాగుతున్న బస్సు యాత్ర!

26 నుంచి రాష్ట్రమంతటా ప్రచారం

సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రమంతటా ఇంటింటి ప్రచారం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పులివెందులలో ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి వైఎస్ భారతికి అప్పగించనున్నారు. తొలివిడత సిద్ధం పేరుతో ప్రాంతాల వారీగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించిన సీఎం జగన్.. గత కొంతకాలంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button