తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

Memantha Siddham Bus Yatra: నుదిటిపై గాయం మానకపోయినా.. కొనసాగుతున్న బస్సు యాత్ర!

వైసీపీ అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’ 17వ రోజుకు చేరుకుంది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం బస్సు యాత్రకు విరామం ఇవ్వగా.. నేడు తేతలి నుంచి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. నుదిటిపై గాయం మానకపోయినా.. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం జగన్‌ తన బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు. ఇక, జగన్ అభిమానులు, ప్రజలు జననాయకుడికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.

ALSO READ: ‘పక్కా తెలుగు’ గ్రౌండ్ రిపోర్ట్.. వైసీపీకి 112 సీట్లు!

85 కిలోమీటర్లు సీఎం జగన్ రోడ్‌షో..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ మేరకు సాయంత్రం రాజమండ్రి సిటీలో 85 కిలోమీటర్లు సీఎం జగన్ రోడ్‌షో నిర్వహించనున్నారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్‌ మిల్‌ సెంటర్, దివాన్‌ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకోనున్నారు. బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విధితమే. కాగా, సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు.

ALSO READ: చంద్రబాబుకు పుట్టుకతోనే మోసం అలవాటు!

తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభం

తేతలి నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటే వస్తున్నారు. జిల్లాలు దాటి ఎండా, వాన లెక్క చేయకుండా ప్రయాణం చేస్తున్నారు. యువత చిందులు వేస్తూ ఉత్సాహపరుస్తుండగా.. పగలూ, రాత్రి తేడా లేకుండా అవ్వాతాతలు వేచిచూస్తున్నారు. ఒకవైపు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణ సంచాలతో అఖండ స్వాగతం పలుకుతుండగా.. మరోవైపు టన్నుల కొద్దీ పూలతో సీఎంకు భారీ దండలు, గజమాలలతో సత్కరిస్తున్నారు. గజమాలల పరిమాణం దాటడంతో క్రేన్లు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా..మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా అపురూప దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button