Chandrababu Arrest: బెయిలా.. జైలా.. విజయవాడలో తీవ్ర ఉత్కంఠ..!
ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు భవిష్యత్తు ఈరోజు తేలనుంది. చంద్రబాబుపై నమోదైన 409 సెక్షన్ చుట్టూనే ఇరుపక్షాల వాదలను జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి. సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపిస్తుండగా, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపిస్తున్నారు.
ఈ కేసులో 409 క్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యాలను చూపించాలని సిద్ధార్థ్ లుత్రా వాదించగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సీఐడీ తరపు న్యాయవాది వివరించారు. ఇక భోజన విరామం తర్వాత 17ఏ మీద వాదనలు కొనసాగుతున్నాయని సమాచారం. మరి ఇరు పక్షాల వాదలను పూర్తయ్యాక వచ్చే తీర్పు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇక మరోవైపు మరోవైపు ఏసీబీ కోర్టు ప్రాంతంలో హైవోల్టేజ్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో విపరీతమైన ఆందోళన నెలకొని ఉంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్నటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు వాదనలు జరుగుతుంటే, మరోవైపు భారీగా పోలీసులను మోహరించారు. దీంతో చంద్రబాబును జైలుకు తీసుకెళతారేమో అని టీడీపీ శ్రేణులు ఆందోళణ వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగుకుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే భారీగా పోలీసులు, వాహనాలను రంగంలోకి దించారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టు ఆవరణ చుట్టూ ఏం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొంది. కోర్టులో వాదనలు పూర్తయ్యాక, తీర్పు వెలువనున్న నేపధ్యంలో, చంద్రబాబుకు బెయిలా, జైలా అనేది మరికొద్దిసేపట్లో తేలిపోనుంది.