Memantha Siddham Bus Yatra: 18వ రోజుకు చేరిన సీఎం జగన్ ‘బస్సు యాత్ర’..దారిపొడవునా ఘన స్వాగతం
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. అంతకుముందు రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరారు. ఈ యాత్రలో భాగంగా రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకోనున్నారు. కాగా, సీఎం జగన్కు స్వాగతం పలికేందుకు ప్రజలు రోడ్లపై బారులు తీరారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో అఖండ స్వాగతాలు పలుకుతున్నారు.
ALSO READ: జగన్కు రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ.. తీవ్ర నిరాశలో టీడీపీ కూటమి!
కాకినాడ అచ్చంపేట జంక్షన్లో సభ..
ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. అంతకుముందు, 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తారు. కడియపులంకలో సీఎం వైఎస్ జగన్పై పూల వర్షం కురిపించగా.. వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు, బైక్ ర్యాలీలతో యువత కదం తొక్కారు. బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో మహిళలు దిష్టి తీశారు.
Ji jagan
Ji jagan, elanti nayakude manaku kavali