Memantha Siddham Bus Yatra: విశాఖలో రోడ్ షో..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ!
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా చిన్నయపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరారు. ఈ యాత్ర.. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అక్కడినుంచి గోపాలపట్నం, ఎన్ఏడీ జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజిపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.
ALSO READ: సీఎం జగన్ హామీతో లక్షా నలభై వేల మంది వాలంటీర్లు రాజీనామా!
అనకాపల్లిలో ట్రైలర్ మాత్రమే..
విశాఖలో బస్సు యాత్రను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ బస్సు యాత్ర విశాఖ వెస్ట్లో ప్రవేశించి నార్త్, ఈస్ట్ నియోజకవర్గాల మీదుగా భీమిలి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనానికి సంబంధించి ట్రైలర్ అనకాపల్లిలో చూశామని, ఇవాళ సాగర తీరంలో ప్రజా ఘోష రూపంలో ఫుల్ సినిమా చూస్తామని వైసీపీ అంటోంది. మరి కొద్ది గంటల్లో విశాఖ తీరాన్ని జన సునామీ తాకనుందని వైసీపీ హెచ్చరిస్తోంది. బస్సు యాత్రలు, రోడ్షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
2 Comments