తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YSRCP: వైసీపీ నేతలతో జగన్ కీలక సమావేశం.. రేపే మేనిఫెస్టో ఫైనల్!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తుంది. ఇటీవల ‘సిద్ధం’ పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. ప్రస్తుతం ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రలు చేపట్టింది. విశాఖలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్.. రేపు పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఖరారు చేయడంపై తుది కసరత్తు జరుగుతోందని సమాచారం.

ALSO READ: విశాఖలో రోడ్ షో..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ!

ఈ నెల 26 లేదా 27న విడుదల

ఎన్నికలు అనగానే వెంటనే గుర్తొచ్చేది పార్టీల మేనిఫెస్టో. ప్రజలకు తాము ఏం చేయబోతున్నాం, ఏ విధమైన పనులు చేస్తామో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంటారు. ఈ మేరకు వైసీపీ మేనిఫెస్టోను సోమవారం సీఎం జగన్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 26 లేదా 27న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న సీఎం జగన్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 26 లేదా 27న మేనిఫెస్టోను రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, జగన్ ఎన్నికల మేనిఫెస్టో పై గతంలో స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.

ALSO READ:  సీఎం జగన్ హామీతో లక్షా నలభై వేల మంది వాలంటీర్లు రాజీనామా!

పెరిగిన వైసీపీ గ్రాఫ్..

175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ ముందుకు వెళ్తుందని. ‘సిద్ధం’ సభలతో పాటు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని వైసీపీ చెబుతోంది. అయితే ఈ సారి మేనిఫెస్టోలో కూటమి, వైసీపీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తారనేది కీలకంగా మారుతోంది. హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల యుద్దంలో ఇప్పుడు రెండు వైపులా మేనిఫెస్టోల పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. కాగా, ఇటీవల చేసిన పలు సర్వేల్లో వైసీపీ గెలిచే సీట్ల సంఖ్య పెరిగినట్లు చెబుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలన్నీ వైసీపీకి అనుకూలంగా మారాయని వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button