Bollywood: మేకింగ్ వీడియోతో గూస్ బంప్స్… ఉత్కంఠ పెంచేసిన ‘బడే మియా చోటే మియా’
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో చిత్రబృందం విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
Also Read: సితార పేరుతో ఇన్స్టాగ్రామ్లో లింక్స్… ఓపెన్ చేశారో ఇక అంతే!
తాజాగా ఈ చిత్రం నుంచి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్న యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తేనే ఉత్కంఠ పెరిగిపోయేలా ఉంది. అంత అద్భుతంగా యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఛేజింగ్ సన్నివేశాలు, బ్లాస్టింగ్ సీన్స్తో మూవీని ఒక రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ముంబై, లండన్, అబుదాబి, స్కాట్లాండ్, జోర్డాన్ లాంటి ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్స్ లో ఈ మూవీని చిత్రికరిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో థ్రిల్లింగ్కి గురిచేసేలా కనిపిస్తుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.
Also Read: మెగాస్టార్ జీవిత చరిత్రపై యండమూరి ఆసక్తికర వ్యాఖ్యలు
జాకీ భగ్నానీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఒకేసారి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవల యాక్షన్ చిత్రాలు ఎక్కువగా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. మరి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.