తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Defemation Suit: దెబ్బతిన్న ఫ్యాన్స్ మనోభావాలు.. పూనమ్ పాండేపై పరువునష్టం దావా

బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీపరీతంగా వినిపిస్తోంది. పూనమ్ పాండే ఇటీవల తను చనిపోయినట్లు చేసిన స్టంట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో తనపై విమర్శలు తలెత్తుతున్నాయి.

Also read: OY: ‘ఓయ్’ అంటే అర్థం తెలుసా.. డైరెక్టర్ ఆ పేరు ఎందుకు పెట్టాడు

తాజాగా పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై కాన్పూర్ కోర్టులో రూ.100 కోట్లకు దావా దాఖలైంది. ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి పూనమ్ చేసిన స్టంట్‌పై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సర్వైకల్ క్యాన్సర్ తో పూనమ్ తన బూటకపు మరణ వార్తను వ్యాప్తి చేయడం వల్ల దేశ ప్రజల మనోభావాలను.. పూనమ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాన్ని అపహాస్యం చేశారని ఫైజాన్ అన్సారీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ విషయంపై తక్షణమే విచారణ చేయాలంటూ ఫైజాన్ అన్సారీ తన కంప్లైంట్ లో తెలిపాడు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో తెలియాల్సి ఉంది.

పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయినట్లు ఫిబ్రవరి 2న మొదలైన గొడవ.. అందరినీ షాక్ కలిగేలా చేసింది. ఇక అంతలోనే.. తాను చచ్చిపోలేదు.. అంత నాటకం.. కేవలం సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన తీసుకురావడానికి అంటూ వీడియో రిలీజ్ చేసి ఒక్కసారిగా ఆశ్చర్యం కలుగజేసింది. దీంతో పూనమ్ పాండే చావు డ్రామాపై నెటిజన్స్ నుంచి సినీ లవర్స్ వరకు విభిన్నమైన శైలిలో రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అంతేకాదు ఈ స్టంట్ తర్వాత పూనమ్ కు అసలైన కష్టాలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button