తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Hanuman: యూపీ సీఎంను కలిసిన హనుమాన్ మూవీ టీం.. సినిమాని మెచ్చుకున్న యోగి

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను హనుమాన్ మూవీ టీం ఆయన కార్యాలయంలో కలిసింది. మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్రానికి ప్రేక్షకులు, యువత నుంచి వచ్చిన స్పందనపై, అలాగే మూవీ విజయవంతం కావడానికి గల కథ, కారణాలను చర్చించారు.

Also read: Salaar-2: సలార్-2 నుంచి కీలక అప్డేట్.. అసలు కథ అదేనా?

సీఎం యోగితో భేటీ అనంతరం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. “యోగి జీని కలవడం నిజంగా నాకు గౌరవం, స్ఫూర్తిదాయకమైన క్షణం. ‘హనుమాన్’ కోసం ఆయన ప్రోత్సాహం అందిస్తూ, భారతీయ ఇతిహాసాలతో సూపర్ హీరో డైనమిక్స్‌ను విలీనం చేసే మంచి కథను తెరకెక్కించారని, ముందుముందు ఇలాంటి సినిమాలు తీసే ప్రయత్నంలో తన సహకారం ఉంటుందని చెప్పారు.

“సినిమాలతో మన సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయన మాతో చర్చించారు. సినిమాల్లో సంప్రదాయం, ఆవిష్కరణల కలయికకు విలువనిచ్చే నాయకుడు ఉండటం సంతోషకరమైన విషయం, ఇది సినిమాలో కొత్త పుంతలు తొక్కేందుకు మమ్మల్ని ప్రేరేపిస్తుంది.”

ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశం కావడంపై హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా కృతజ్ఞతలు తెలిపారు. “యోగి జీని కలవడం ఒక సంపూర్ణమైన గౌరవం, ‘హనుమాన్’ గురించి, మన సంస్కృతిపై దాని ప్రభావం గురించి చర్చించడం తనకు అపారమైన గర్వాన్ని నింపింది. ‘హనుమాన్’లో ప్రధాన పాత్ర పోషించడం ఒక సవాలు, ఒక ప్రత్యేకత.” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button