AP Elections: బాబులా దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు.. సీఎం జగన్
రాష్ట్రంలో చంద్రబాబు లాంటి నాయకులతో రాజకీయాలు భ్రష్టు పట్టాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబును ఉద్ధేశించి మాట్లాడారు. రాజకీయాల్లో బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదని, నేను నమ్ముకుంది దేవుడు, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని జగన్ వెల్లడించారు. మరో వైపు రానున్న ఎన్నికలకు మనం సిద్ధంగా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి మాత్రం మేము ఇంక సిద్ధంగా లేమంటూ మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: పేదలకు ఇంటి స్థలాలపై హక్కులు.. దేశ చరిత్రలోనే తొలిసారి
కుప్పం నుంచి బాబు బైబై..
చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదని, అందుకే కుప్పం నుంచి చంద్రబాబు బైబై అంటున్నారని జగన్ అన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మీ అందరినీ ఒక్కటే కోరుతున్నా.. చంద్రబాబు మాదిరి నాన్ రెసిడన్స్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదని చెప్పుకొచ్చారు. నాకు చంద్రబాబు మాదిరి పత్రికలు, మీడియా మద్దతు లేదు.. ఇక దత్తపుత్రుడు మద్దతు అంతకంటే లేదన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అంటూ కోరారు.
ALSO READ: జనసేనకు దూరమవుతున్న కాపులు.. కారణం అదేనా!
చంద్రబాబు రాజకీయ రాక్షసుడు
వంద సినిమాల్లో విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ అని జగన్ విమర్శించారు. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని, ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా కేసులు వేయించారన్నారు. ఆ కేసులన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని, ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని బాబు అంటున్నాడు. ఇలాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలిచ్చి 10 కూడా నెరవేర్చలేదన్నారు. నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు.. ఎవరూ నమ్మకండి అంటూ సభలో వెల్లడించారు.