తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకాలు పూర్తి.. త్వరలో అధికారిక ప్రకటన?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ‘వై నాట్ 175’ నినాదంతో అధికార వైసీపీ మరోసారి అధికారమే లక్ష్యంగా ‘సిద్ధం’ సభలతో దూసుకుపోతోంది. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు సీట్ల పంపకాలపై తర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరితో బీజేపీ కూడా జట్టు కట్టనుంది. అయితే ఎట్టకేలకు ఈ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

ALSO READ: కాంగ్రెస్‌కు ఆర్కే గుడ్‌బై.. కారణం అదేనా!

సీట్ల పంపకాల విషయంలో మొన్నటి దాకా ఎటూ తేల్చుకోలేకపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మిత్రపక్షమైన జనసేనకు కేటాయించే సీట్లపై కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆ పార్టీకి 30 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు (అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం) ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. అలాగే బీజేపీకి 5 లోక్‌సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button