Dilhi: ప్రధాని మోదీని కలిసిన రేవంత్, భట్టి… కీలక విషయాలపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు, గ్రాంట్లపై చర్చించినట్లు తెలుస్తుంది. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు.
పాలమూరు-డిండి ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇవ్వాలని విన్నవించారు. కాగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి వీరిద్దరు నేతలు దేశ ప్రధానిని కలిచారు.
Also Read: లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ… డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం: కిషన్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా రేవంత్, భట్టిలు సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత కె.సి.వేణుగోపాల్తో పాటు వీలును బట్టి రాహుల్గాంధీతో కూడా ఈ ఇరువురు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై పార్టీ పెద్దలతో ఇరువురు నేతలు చర్చిస్తారని సమాచారం.