తెలుగు
te తెలుగు en English
జాతీయం

DMK MP: వివాదస్పదమైన డీఎంకే ఎంపీ ద‌యానిధి మారన్ వ్యాఖ్యలు

యూపీ, బీహార్ నుంచి వ‌చ్చిన హిందీ మాట్లాడేవారు త‌మిళ‌నాడులో టాయ్‌లెట్స్‌, రోడ్ల‌ను శుభ్రం చేయ‌డంతో పాటు భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లో స్ధిర‌ప‌డుతున్నార‌ని డీఎంకే ఎంపీ ద‌యానిధి మారన్ చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపాయి. డీఎంకే ఎంపీ వ్యాఖ్య‌లతో కూడిన వీడియోను బీజేపీ జాతీయ ప్ర‌తినిధి షెహ‌జాద్ పూనావాలా షేర్ చేశారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

సుందర్ పిచాయ్ తమిళనాడు వ్యక్తి అని, ఇప్పుడు గూగుల్ ను నడిపిస్తున్నాడని గర్వంగా చెప్పారు. ఒకవేళ సుందర్ పిచాయ్ గనుక హిందీ నేర్చుకుని ఉంటే ఇక్కడే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఉండేవాడని దయానిధి మారన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో చిన్నప్పటి నుంచే ఇంగ్లీషు నేర్పించడం వల్ల వారు ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించి మంచి వేతనాలు పొందుతున్నారని వివరించారు. కాగా, దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.

Also Read: సంజయ్ సింగ్ కు షాక్… కేంద్రం కీలక నిర్ణయం

డీఎంకే నేతలపైనా, ఇండియా కూటమి పెద్దలపైనా పూనావాలా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో మరోసారి విభజన రాజకీయాలు చేసే ప్రయత్నం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button