Shivraj Singh Chouhan: ప్రాణాపాయ స్థితిలో యువకుడు… కాపాడిన మాజీ సీఎం
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. భోపాల్లోని రవీంద్ర భవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు. భోపాల్ లోని రవీంద్ర భవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: కేటీఆర్ ను మించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. ఒక్క రోజులోనే దిగ్గజ కంపెనీ రాక
మరో యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న చౌహాన్.. ప్రమాద ఘటనను గుర్తించి తన కాన్వాయ్ని ఆపారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన తన కాన్వాయ్లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చౌహాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడి చౌహాన్ తన పెద్ద మనసు చాటుకున్నారు.