తెలుగు
te తెలుగు en English
జాతీయం

Shivraj Singh Chouhan: ప్రాణాపాయ స్థితిలో యువకుడు… కాపాడిన మాజీ సీఎం

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. భోపాల్‌లోని రవీంద్ర భవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు. భోపాల్‌ లోని రవీంద్ర భవన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: కేటీఆర్ ను మించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. ఒక్క రోజులోనే దిగ్గజ కంపెనీ రాక

మరో యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న చౌహాన్‌.. ప్రమాద ఘటనను గుర్తించి తన కాన్వాయ్‌ని ఆపారు. గాయపడిన యువకుడిని హుటాహుటిన తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చౌహాన్‌ని మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడి చౌహాన్‌ తన పెద్ద మనసు చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button