తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Kollywood: హీరోలకు రెడ్ కార్డు… తమిళ నిర్మాతల సంఘం సంచలన నిర్ణయం

అగ్రహీరోలపై తమిళ నిర్మాతల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పలువురు హీరోలు నిర్మాతలకు సహకరించలేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధనుష్, విశాల్, సింబు, అధర్వ ఇకపై సినిమాల్లో నటించకుండా రెడ్ కార్డు విధిస్తున్నట్టు తమిళ నిర్మాతల సంఘం ప్రకటించింది. కార్యనిర్వాహక సమావేశంలో నిర్మాతల సంఘం అగ్రహీరోలపై రెడ్ కార్డు జారీ చేసింది.

నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో హట్ టాఫిక్ గా మారింది. నిర్మాత మైఖేల్ రాయప్పన్ తో సింబుకు వివాదం ఉంది.కాగ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేసినట్టు విశాల్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక, తనందాళ్ చిత్ర నిర్మాణ సంస్థ చేపట్టిన ఓ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయ్యాక ధనుష్ సహకరించలేదనేది మరో ఆరోపణ. దాంతో నిర్మాతకు నష్టం వాటిల్లిందని తమిళ నిర్మాతల సంఘం ఆరోపిస్తోంది. నిర్మాతలకు సహకరించలేదని అధర్వపైనా ఆరోపణలు ఉన్నాయి. ఈ జాబితాలో ఎస్ జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా తమిళ నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయం కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button