తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Guntur Kaaram: ఓటిటిలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. ఇంత త్వరగానా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమాకు మొదటిరోజు నుండే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ రికార్డ్ లెవల్లో కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ.210 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజనల్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరు కారం.

Also read: Nijame Ne Chebutunna: ఊరు పేరు భైరవకోన నుంచి కీలక అప్డేట్.. టాప్ ట్రెండింగ్ లో నిజమేనే చెబుతున్న సాంగ్

తాజాగా గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. గుంటూరు కారం మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం విడుదలైన 28 రోజుల తరువాత మాత్రమే స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ ఆయారట. ఆ ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో మహేష్ గుంటూరు కారం ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. ఈ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ తో సహా కామన్ ఆడియన్స్ కూడా హ్యాపీ గా ఫీలవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button