Guntur Karam: మరోసారి గొప్ప మనసు చాటిన సితార.. అనాథ పిల్లల కోసం స్పెషల్ షో
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని నెలల క్రితం ఒక జ్యూవెలరీ యాడ్తో వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఒక స్వచ్చంద సంస్థకు విరాళంగా అందజేసింది. తర్వాత తన పుట్టిన రోజున పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది. తాజాగా, సితార మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. అనాథ పిల్లల కోసం ఏకంగా ‘గుంటూరుకారం’ స్పెషల్ షో ఏర్పాటు చేసింది.
ALSO READ: ఓటీటీలోకి వ్యూహం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్లో..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరుకారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, చీర్స్ ఫౌండేషన్ సంస్థకు చెందిన అనాథ బాలలకు గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్లో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో సితార ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆమె చిన్నారులతో కలిసి గుంటూరు కారం సినిమా చూశారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.