Gunturu Kaaram: ‘ధమ్ మసాలా బిర్యానీ’ ఫుల్ సాంగ్ రిలీజ్..వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ రెస్పాన్స్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. తాజాగా మేకర్స్ ఈ మూవీని నుంచి ధమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.
ALSO READ: శ్రీమంతుడు మూవీ కాపీరైట్స్.. కొరటాల శివకు సుప్రీంకోర్టు ఝలక్
ధమ్ మసాలా బిర్యానీ..
“ఎదురొచ్చే గాలి… ఎగరేస్తున్నా చొక్కా పై గుండీ… ఎగబడి ముందరకే వెళ్లిపోతాది నేనెక్కిన బండి. ధమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి, నీంబు సోడా… ఫుల్ బీడీ, గుద్ది పారేయి గుంటూరునే” అంటూ సాగిన ఈ పాట రిపీట్ మోడ్లో వినేలా చేస్తుంది. ఇక ఈ పాటను సంజిత్ హెగ్డే & జ్యోతి నూరన్ కలిసి పాడగా లిరిక్స్ ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి, సంగీతం థమన్ ఎస్ అందించారు. ఇక ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలు పోషించారు.